మహబూబ్‌నగర్‌ : విద్యార్థులతో గవర్నర్‌ నరసింహన్‌ ముఖాముఖి

 ఫరూఖ్‌నగర్‌, ఆగస్టు 24 : ఫరూఖ్‌నగర్‌ మండలం కిషన్‌నగర్‌ పాఠశాల ఆవరణలో గ్రామజ్యోతి కార్యక్రమంలో రాష్ట్ర గవర్నరు నరసింహన్‌తోపాటు మంత్రులు కేటీఆర్‌, జూపల్లి, ఎంపీ జితేందర్‌రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌ విద్యార్థులతో మాట్లాడారు. సర్పంచి, కమిటీ సభ్యులతో గ్రామ సమస్యలను గవర్నరు అడిగి తెలుసుకున్నారు.