మహిళల జట్టు.. టీ20 సిరీస్‌ తొలి టీ20లో ఇంగ్లాడ్‌ గెలుపు

– 41పరుగుల తేడాతో ఘన విజయం
– బ్యాటింగ్‌, బౌలింగ్‌లో విఫలమైన భారత్‌ జట్టు
గుహవాటిక, మార్చి4(జ‌నంసాక్షి) : ఇంగ్లాండ్‌పై వన్డే సిరీస్‌ను 2-1తో గెలిచిన భారత మహిళల జట్టు.. టీ20 సిరీస్‌ను మాత్రం పేలవ ఓటమితో ఆరంభించింది. గౌహతి వేదికగా సోమవారం ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి
టీ20 మ్యాచ్‌లో బౌలింగ్‌, బ్యాటింగ్‌లో విఫలమైన భారత్‌ జట్టు 41 పరుగుల తేడాతో ఓడిపోయింది. టీ20 కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ గాయం కారణంగా ఈ సిరీస్‌కి దూరమవగా.. స్మృతి మంధాన నాయకత్వంలో బరిలోకి దిగిన భారత్‌ జట్టు తొలి మ్యాచ్‌లోనే పరాజయాన్ని చవిచూసింది. దీంతో.. మూడు టీ20ల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ జట్టు 1-0తో ఆధిక్యంలో నిలవగా.. రెండో టీ20 గురువారం జరగనుంది. మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత కెప్టెన్‌ స్మృతి మంధాన మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. కానీ.. బౌలర్లు లయ తప్పడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఆ జట్టులో టావిూ (62: 57 బంతుల్లో) అర్ధశతకంతో సత్తాచాటగా.. కెప్టెన్‌ హైథర్‌ నైట్‌ (40: 20 బంతుల్లో ) బౌండరీలతో మెరిసింది. లక్ష్య ఛేదనలో భారత్‌ జట్టు ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు చేజార్చుకుంది. ఫామ్‌లో ఉన్న స్మృతి మంధాన (2: 8 బంతుల్లో) ఒత్తిడికి గురవగా.. మరో ఓపెనర్‌ హర్లీన్‌ (8: 10 బంతుల్లో) నిరాశపరిచింది. అనంతరం వచ్చిన జెవిూయా రోడ్రిగ్స్‌ (2), మిథాలీ రాజ్‌ (7), వేద (15) కూడా తక్కువ స్కోరుకే ఔటవడంతో 10 ఓవర్లు ముగిసే సమయానికి భారత్‌ 46/5తో ఓటమిని ఖాయం చేసుకుంది. ఆఖర్లో దీప్తి శర్మ (22: 23 బంతుల్లో), అరుంధతి రెడ్డి (18: 19 బంతుల్లో 2లీ4) కాసేపు క్రీజులో నిలిచినా.. వారి ఇన్నింగ్స్‌ ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగింది. దీంతో భారత్‌పై ఇంగ్లాండ్‌ 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఇంగ్లాండ్‌ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో కేథరిన్‌ బ్రంట్‌, లిన్సీ స్మిత్‌ చెరో రెండు వికెట్లు, అన్యా శ్రుబ్సోల్‌, కేట్‌ క్రాస్‌ తలో వికెట్‌ తీశారు.