మహిళా, శిశు సంక్షేమ అధికారులకు సన్మానం

జనగామ,జనవరి28(జ‌నంసాక్షి): మహిళా, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి పద్మజారమణ, ఐసీడీఎస్‌ పీవో ప్రేమలత ఉత్తమ సేవలందించినందుకు గాను గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి చేతుల విూదుగా ప్రశంసాపత్రాలు అందుకున్నారు. దీంతో వారికి సోమవారం మానవ హక్కుల క్లబ్‌ (హెచ్చార్సీ) ఆధ్వర్యంలో సన్మానం చేశారు. హెచ్చార్సీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ జేరిపోతుల పరశురాం మాట్లాడుతూ.. జిల్లాలో మహిళా, శిశు సంక్షేమంతో పాటు దివ్యాంగులు, వయోవృద్ధుల అభ్యున్నతికి ఇద్దరు అధికారులు అంకితభావంతో పని చేస్తున్నారని కొనియాడారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారి రవికాంత్‌, రాజశేఖర్‌, పాషా, విజయ్‌, హేమలత, క్రాంతి, సైదులు, శిల్ప తదితరులు పాల్గొన్నారు.