మాజీ ఎంపి వండవ దొర మృతి

శ్రీకాకుళం,ఆగస్ట్‌19 (జనం సాక్షి) :  పార్వతీపురం మాజీ ఎంపీ విశ్వాసరాయి నరసింహారావు దొర(వండవ దొర) (95) కన్నుమూశారు. స్వగ్రామం వీరాఘట్టం మండలం వండవలో తుదిశ్వాస విడిచారు. దొర.. ఒకసారి పార్వతీపురం ఎంపీగాను, మూడు సార్లు కొత్తూరు శాసనసభ్యుడిగాను పనిచేశారు. నరసింహారావు దొర కుమార్తె కళావతి ప్రస్తుతం పాలకొండ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.