మాజీ చీఫ్ జస్టిస్ సచార్ కన్నుమూత
న్యూఢిల్లీ,ఏప్రిల్ 20(జనంసాక్షి):మానవ హక్కుల కార్యకర్త, ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రాజేందర్ సచార్(94) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సచార్ అంత్యక్రియలు సాయంత్రం లోధి రోడ్లో జరగనున్నాయి. 1985, ఆగస్టు 6 నుంచి అదే ఏడాది డిసెంబర్ 22 వరకు చీఫ్ జస్టిస్గా సచార్ సేవలందించారు. పదవీ విరమణ అనంతరం పౌర హక్కుల కోసం పోరాడారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ముస్లింల సామాజిక, ఆర్థిక, విద్యా స్థితిగతులపై వేసిన కమిటీకి చైర్పర్సన్గా జస్టిస్ రాజేందర్ సచార్ వ్యవహరించారు. 2012లో సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు, జర్నలిస్టులతో పాటు పలువురు ప్రముఖులంతా కలిసి రాష్ట్రపతి పదవిని రాజేందర్ సచార్కు ఇవ్వాలని మద్దతు తెలుపుతూ డిమాండ్ చేశారు.