మానాన్నచనిపోయాడంటూ దుష్పచ్రారం

డాక్టర్‌ రమేశ్‌ కొడుకు వరుణ్‌ వీడియో సందేశం
వరంగల్‌,జూన్‌18(జ‌నంసాక్షి): హన్మకొండలో ప్రముఖ చర్మ వైద్యుడు డాక్టర్‌ వీ.రమేష్‌ కరోనా వైరస్‌ వ్ల చనిపోయారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కుమారుడు డాక్టర్‌ వరుణ్‌ తప్పుబట్టారు. ఆయన చికిత్స పొందుతున్నారని, ఆరోగ్యంగా ఉన్నారని ఒక వీడియో విడుద చేశారు. తన తండ్రి చనిపోయాడని సోషల్‌ విూడియాలో దుష్పచ్రారం జరుగుతోందని, అలాంటి వదంతును నమ్మవద్దని విజ్ణప్తి చేశారు. ఇలాంటి ప్రచారాతో తమను అప్రతిష్ట చేయవద్దన్నారు. ప్రస్తుతం తన తండ్రి చికిత్స పొందుతున్నారని త్వరలోనే కోుకుంటారని వరుణ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక ఈ విషయమై డాక్టర్‌ రమేష్‌ సైతం ఓ వీడియో సందేశాన్ని ఇచ్చారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని తనపై వచ్చే వదంతున్నీ అవాస్తవమని ఆసుపత్రి బెడ్‌ పై నుంచే వీడియో ద్వారా వ్యక్తం చేశారు. తాను తొందరలోనే కోుకుంటానని, మళ్లీ తన విధు నిర్వహిస్తానని డాక్టర్‌ రమేష్‌ పేర్కొన్నారు.