మాస్క్‌ వేసుకున్నంత మాత్రాన వైరస్‌ను అడ్డుకోలేం

వైద్యు హెచ్చరికు
హైదరాబాద్‌,మార్చి23(జనం సాక్షి ): శాస్త్రీయ పద్ధతిలో మాస్క్‌ వేసుకోకుంటే దాని వ్ల లాభం కంటే నష్టమే ఎక్కువని వైద్యు అంటున్నారు. కరోనా వైరస్‌ను నివారించాంటే మామూు మాస్కు కాదని, ఎన్‌`95 మాస్కు ధరించాని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోందని అన్నారు. కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమావళిని పాటిస్తూ, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. తమ వరకూ రాదు అని ఎవరూ అనుకోకూడదు. పడవ మునిగేంత వరకూ చూస్తూ ఊరుకోకుండా జాగ్రత్తగా ఉండాని సూచించారు.
కరోనా వైరస్‌ను నివారించేందుకు పువురు మాస్క్‌ు ధరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మాస్క్‌ు ధరించాలా? అసు మాస్క్‌ ఎంత వరకు సేఫ్‌ అనే అంశాపై ఊపిరితిత్తు నిపుణు తమ అభిప్రాయాు వ్లెడిరచారు. వైద్యు, కరోనా క్షణాున్న వారికి సేమ అందించేవారు, తుమ్ము, దగ్గు ఉన్న వారు మాత్రమే మాస్క్‌ు ధరించాలి. మాస్క్‌ ధరించేందుకు శాస్త్రీయ విధానం ఉందన్నారు. మాస్క్‌ సరిగా ధరించకపోతే లాభం కంటే నష్టమే అధికం అన్నారు. వైరస్‌ వ్యాపిస్తున్న తరుణంలో కూడా ప్రతి ఒక్కరూ మాస్క్‌ వేసుకోకూడదన్నారు. మాస్క్‌ లోపలి భాగంలో చేతుతో తాకినా, మాస్క్‌ వేసుకున్నాం కదా అని చేతు శుభ్రంగా కడుక్కోకపోయినా నష్టపోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. మాస్క్‌ వేసుకున్నాక తరచూ దాన్ని తాకకూడదన్నారు. మాస్క్‌ వేసుకోవడం వ్ల కొంత అసౌకర్యం ఉంటుంది. దాంతో చాలామంది దాన్ని తరచూ అటు ఇటూ జరుపుతూ ఉంటారు. ఆ సమయంలో మన గోళ్లు నుంచి ఇన్‌ఫెక్షన్‌ ముక్కు ద్వారా నేరుగా ఊపిరితిత్తులోకి చే రే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. అలాగే అవసరం లేకున్నా మాస్క్‌ వేసుకోవడం కూడా మంచిది కాదన్నారు.