మిర్యాలగూడను వదులుకునేది లేదు

కోదండరామ్‌ ఇంటిముందు ఆందోళన

హైదరాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): మిర్యాలగూడ టికెట్‌ టీజేఎస్‌ కే కేటాయించాలంటూ హైదరాబాద్‌ లోని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం ఇంటి ముందు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కోదండరాం ఇంటి ముందు బైఠాయించి, తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. మిర్యాలగూడ టికెట్‌ వేరే పార్టీకి ఇస్తే ఊరుకునేది లేదని టీజేఎస్‌ కార్యకర్తలు హెచ్చరించారు.