మిషన్ కాకతీయ పనులను ప్రారంభించిన సీఎం కేసీఆర్..

నల్గొండ : జిల్లా నకిరేకల్ మండలం చందుపట్లలో పెద్ద చెరువు పునరుద్దరణ పనులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. మిషన్ కాకతీయలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి, భువనగిరి ఎంపీ భూర నర్సయ్యగౌడ్, తెలంగాణ శాసనమండలి డిప్యూటి ఛైర్మన్ నేతి విద్యా సాగర్ రావు తదితరులు పాల్గొన్నారు.