మీటర్లు బిగించే మోదీ కావాలా?

వద్దనే కేసీఆర్‌ కావాలా.. మీరే తేల్చుకోండి
` తెలంగాణ తెచ్చుకున్నాం..ఫ్లోరైడ్‌ను తరిమికొట్టాం
` నేతన్నలపై జీఎస్టీ ఏంది?..
` మునుగోడు దెబ్బతో బిజెపి దిమ్మ తిరగాలి
` ` దేశం బాగుపడడాలంటే భాజపా పోవాలి
` ఈడీల బెదిరింపులకు భయపడేది లేదు
` మరో ఏడాదిలో ఎన్నికలుండగా ఈ ఉప ఎన్నిక ఏంది?
` దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న బిజెపి పనిపట్టాలి
` ప్రజా వ్యతిరేక బిజెపితో పోరాటంలో కలసి రావాలి
` మునుగోడు ఉప ఎన్నిక ఎవరి కోసం వచ్చింది
` ఓటేసే ముందు కరెంట్‌ మోటర్‌కు, సిలిండర్‌కు దండం పెట్టాలి
` కృష్ణా వాటా తేల్చాలంటూ అమిత్‌ షా కు సవాల్‌
` రైతుల పట్ల బిజెపి శతృవుగా మారింది
` మునుగోడు ఉప ఎన్నిక సమరశంఖం పూరించిన కెసిఆర్‌
నల్లగొండ(జనంసాక్షి): మునుగోడులో జరిగేది ఉప ఎన్నిక కాదు.. బతుకు దెరువు ఎన్నిక అని కేసీఆర్‌ అన్నారు. మునుగోడులో బీజేపీకి ఓటు పడితే బాయికాడ విూటర్‌ పడ్తదని అన్నారు. ఇక్కడ ఓటుతో దేశంలో బిజెపికి బుద్ది చెప్పాలన్నారు. ఓటేసే ముందు ఇంట్లో సిలిండర్‌కు, బాయికాడమోటర్‌కు దండంపెట్టాలని సిఎం కెసిఆర్‌ అన్నారు. విూటర్లు పెట్టే మోడీ కావాలో లేక విూటర్లు వద్దనే కేసీఆర్‌ కావాలో ప్రజలే తేల్చుకోవాలని అన్నారు. మునుగోడులో నిర్వహించిన ప్రజా దీవెన సభలో పాల్గొన్న కేసీఆర్‌ ఉపెన్నిక సమరశంఖం పూరించారు. బిజెపి పాలనాతీరుపై నిప్పులుచెరిగారు. ప్రజలంతా కలిసి బీజేపీకి విూటర్‌ పెట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఇచ్చిన ధైర్యంతోనే బీజేపీతో పోరాడుతున్నానని, తాను బలహీనపడితే మోడీపై ఎట్లా కొట్లాడాలని ప్రశ్నించారు. తెలంగాణకు కొట్లాడటం కొత్త కాదన్న ముఖ్యమంత్రి యాడదాకైనా కొట్లాడేందుకు సిద్ధమని ప్రకటించారు. ఎవరి సంక్షేమం కోసం ఉప ఎన్నిక వచ్చిందన్న విషయాన్ని జనం గ్రహించాలని కోరారు. బీజేపీని గద్దె దించేందుకు క్రియాశీల, ప్రగతిశీల శక్తులన్నీ ఏకం కావాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. 8 ఏండ్లలో బీజేపీ ఒక్క మంచి పనైనా చేసిందా అని కేసీఆర్‌ ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను కేంద్రం ఎందుకు తేల్చడం లేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం జరగనున్న బీజేపీ సభలో కేంద్ర మంత్రి అమిత్‌ షా తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు మేలు చేయకపోగా.. ప్రభుత్వ సంస్థల్ని అమ్ముతున్నరని మండిపడ్డారు. ప్రజల చేతుల్లో ఉండే ఒకే ఒక ఆయుధం ఓటని, దాని ద్వార నిర్మాణమయ్యే శక్తి అని, మనకు ఉపయోగపడుతదా? పడదా? ఆలోచించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్‌ అన్నారు.’మునుగోడు నియోజకర్గం ఒకనాడు ప్లోరైడ్‌ నీళ్లతోని నడుములు వంగిపోయి.. ఏవిధంగా బాధపడ్డదో నేను చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్‌కన్నా ముందు.. కేసీఆర్‌ దొడ్డు, ఎత్తు ఉన్నవాళ్లు ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు. ఆనాడు ఇదే జిల్లా బిడ్డ సత్యనారాయణ ఉద్యోగానికి రాజీనామా చేసి జలసాధన పోరాటం చేసి ఆనాడున్న ప్రధానమంత్రి ముందుపడుకోబెట్టి అయ్యా మా బతుకు ఇది అంటే.. ఎవడూ మన మొర వినలేదని గుర్తుచేశారు. ఆ తదనంతరం.. నేనే తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన తర్వాత.. మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పినట్టు రాష్ట్రమంతా విూ బాధ గురించి చెప్పుతూ వచ్చిన. అంశాల స్వామికావచ్చు, ప్లోరైడ్‌ బాధితులు కావొచ్చు.. దేశ, విదేశాల నుంచి వచ్చి చూస్తా ఉంటే వాళ్ల నిరసన తెలిపి, బాధను వ్యక్తం చేశారు. మే ప్రదర్శన వస్తువులమా? మమ్మల్ని అవమాన పరుస్తున్నరు.. రాకండి.. విూకు దమ్ముంటే సమస్య పరిష్కరించండి అని తిట్టి పంపారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా నల్లగొండ నగారా అని పేరుతో పది రోజుల పాటు జిల్లామొత్తం తిరిగి ప్లోరైడ్‌ విూద చైతన్య పరచడం జరిగింది. శివన్నగూడెం గ్రామంలో నిద్రకూడా చేశాను. ఏమయనే నల్లగొండ.. అనే మాట గూడ చెప్పడం జరిగింది. అనేక ప్రభుత్వ, అనేక పార్టీలు, అనేక రాజకీయాల తర్వాత మనందరి పోరాటాల ఫలితంగా.. మన తెలంగాణకు వస్తే.. ఇవాళ జీరో ప్లోరైడ్‌.. ప్లోరైడ్‌ రహిత మునుగోడు, నల్లగొండగా మిషన్‌ భగీరథ పథకంతో మార్చుకున్నామని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నల్లగొండ జిల్లా సరైన ప్రయత్నాలు జరుగపోతే మానవ నివాసయోగ్యం కాకుండా పోతుందని, నో మ్యాన్‌ జోన్‌ అవుతుందని, ఇక్కడ మనుషులు నివసించలేరు.. ఇక్కడ శుద్ధి చేసిన నీళ్లు ఇవ్వాలి. ఇక్కడ పండే పంటలు తింటే కూడా ప్రమాదమే అని చెప్పింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినా.. ఆ నాడు రాష్ట్ర, దేశ పాలకులు పట్టించుకోలేదు. మంచినీళ్లయితే కిందపడి విూదపడి తెచ్చుకున్నం. ఒక బాధ పోయింది. సాగుకు నీళ్లు రావాలి. ఎక్కడి నుంచి రావాలి.. నల్గొండ జిల్లా ఉండేది కృష్ణ బేసిన్‌లో.. శివన్నగూడెం ప్రాజెక్టు రావాలి.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తీసుకొని లిప్ట్‌ ద్వారా నింపుకోవాలి. దాని ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నం. ఎన్నికలు రాంగనే ఆగమాగం కావొద్దు.. మన చేతుల్లో ఉన్న అధికారాన్ని ఎవరికో అప్పచెప్పి ఎవరో.. పోరాటం చేయమంటే చేయరు. ప్రజల చేతుల్లో ఉండే ఒకేఒక ఆయుధం ఓటు. దాని ద్వార నిర్మాణమయ్యే శక్తి.. మనకు ఉపయోగపడుతదా? పడదా? ఆలోచించి ఓటు వేయాలన్నారు. మన చుట్టూ ఏం జరుగుతుందో చర్చ పెట్టాలి.. ఆ చర్చలో భాగంగానే ఈ రోజు దేశంలో జరిగే వ్యవహారాలు, ప్రజావ్యతిరేక వ్యవహారాలకు, సమాజాన్ని చీల్చిచెండాడే విద్వేష విధానాలకు వ్యతిరేకంగా పోరాటం జరుగాల్సి ఉందని జాతీయ, రాష్ట్రస్థాయి కమ్యూనిస్ట్‌ నాయకులు, ఇతర పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నారు. గత ఐదారు మాసాలు తలకాయ అంతా పలగొట్టుకుంటున్నమ్‌. ఈ దేశాన్ని ఎలా కాపాడుకోవాలని ఆలోచన చేస్తున్నం. అందులో భాగంగా ఎక్కడ విధంగా ఏరాపేరి గోల్‌మాల్‌ ఉప ఎన్నిక వచ్చిందో తెలుసు. ఏ అక్కర ఉండి వచ్చింది ఇక్కడ ఉప ఎన్నిక’ అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. అమిత్‌షాను టార్గెట్‌ చేశారు. ఆదివారం జరిగే సభలో కృష్ణా జలాలపై అమిత్‌షా తన వైఖరి చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎందుకు కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చడం లేదో అమిత్‌షా చెప్పాలని అన్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు ఉండగా.. రాజగోపాల్‌ రెడ్డి ఎవరి కోసం రాజీనామా చేసి ఉప ఎన్నికకు పోతున్నాడని ప్రశ్నించారు. ఢల్లీిలో మా నీళ్ల సంగతేంటని రాజగోపాల్‌రెడ్డి ఎందుకు అడగరని నిలదీశారు.కొట్లాట తెలంగాణకు, టీఆర్‌ఎస్‌కు కొత్తకాదని, మునుగోడుతోనే తమ పోరాటం ఆగిపోదని అన్నారు. మునుగోడు నుంచి ఢల్లీిదాకా తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. మునుగోడులో గోల్‌మాల్‌ ఉప ఎన్నిక వచ్చిందని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. ’ఎవరికోసం ఈ ఉప ఎన్నిక వచ్చింది. ఇక్కడ బైపోల్‌ రావాల్సిన అవసరం ఏముంది. 8 ఏళ్ల పాలనలో ఏ వర్గానికి మేలు జరిగింది. బ్యాంకులు, రైళ్లు, రోడ్లు అన్నింటినీ కేంద్రం అమ్మేస్తోంది. ఇక రైతులు, భూములను కూడా మోదీ సర్కార్‌ అమ్మేస్తుందేమో. మాకు మద్దతు ఇచ్చిన సీపీఐకు ధన్యవాదాలు. మునుగోడు నుంచి ఢల్లీి దాకా కామ్రేడ్లతో ఐక్యత కొనసాగించాలి.రైతులు తస్మాత్‌ జాగ్రత్త. మోదీ దోస్తులు సూట్‌ కేసులు పట్టుకొని రెడీగా ఉన్నారు. లక్షమందికి పైగా రైతులకు రైతుబంధు ఇస్తున్నాం రైతు బంధు ఎట్టిపరిస్థితిలోనూ ఆగదు. రైతులు కరెంట్‌ విూటర్లు పెట్టమంటే నేనుపెట్టలేదు. విూటర్లు పెట్టే మోదీ కావాలా.. విూటర్లు వద్దనే కేసీఆర్‌ కావాలా.. మునుగోడు చరిత్రలో ఎన్నడూ బీజేపీకి డిపాజిట్‌ రాలేదు. బీజేపీకి ఓటు పడిరదంటే బావి దగ్గర విూటర్‌ వస్తుంది’ అని మునుగోడు సభలో కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. అందుకే సీపీఎం, సీపీఐ నాయకులతో ఒకటే చెప్పా. కేవలం తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రగతిశీల శక్తులన్నీ ఏకం కావాలనే అభిప్రాయాలు పంచుకున్నాం.పల్లా వెంకటరెడ్డి గారు చెప్పినట్లు చిన్న చిన్న విషయాలు పక్కనపెడితే.. దేశం జీవిక దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే సీపీఐ పార్టీలో చర్చలు జరిపి, వాళ్లు పోటీ చేయకుండా మన టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. అందుకోసం వారికి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ పోరాటం ఈరోజుతో ముగిసేది కాదు. మునుగోడు నుంచి ఢల్లీి దాకా మన స్నేహం కొనసాగాలి. దేశంలోని పేదలు, రైతుల బతుకులు బాగుపడే వరకూ దేశంలోని సీపీఐ, సీపీఎం, టీఆర్‌ఎస్‌ వంటి ప్రగతిశీల శక్తులన్నీ కలిసి పోరాడతాయని మాటిస్తున్నా అని కెసిఆర్‌ అన్నారు. దేశంలో కొత్త రాష్ట్రం ఏర్పడితే మన హక్కులు మనకు రావాలి. అన్నదమ్ములు విడిపోతే పంచుకోరా? ఇప్పుడు మన రాష్ట్రం ఏర్పడి 8 ఏండ్లు అవుతోంది. అయ్యా.. ఈ కృష్ణా నదిలో మా వాటా తేల్చండి అని అడిగితే సమాధానం చెప్పరు. ఎన్ని ఇస్తే అన్నే ఇవ్వు. కానీ వాటా చెప్పు అంటే నరేంద్ర మోదీ చెప్పడు. మా నీళ్లలో వాటా ఇవ్వనందుకే రేపు మునుగోడుకు వస్తున్నావా అమిత్‌ షా? సమాధానం చెప్పు. నీ బొమ్మలు కాదు. నీ తాత జేజమ్మల బొమ్మలు కూడా మేం చూశాం. కొట్లాటలు తెలంగాణకు కొత్త కాదు. కొట్లాట మొదలైతే ఎంత దూరమైనా పోతాం. ఇలాంటి బొమ్మలు కాదు. ఎందుకు కృష్ణా జలాల్లో మా వాటా తేల్చడం లేదు? సమాధానం చెప్పు‘ అని అమిత్‌షాను ప్రశ్నించారు. పంద్రాగస్టును ప్రధాని మాట్లాడితే మైకులు పగిలిపోయాయి. నీళ్ల వాటా తేలిస్తే చకచకా నీళ్లు తెచ్చుకుంటాం. తేలిన చోట గోదావరి నుంచి తెచ్చుకున్నాం. తుంగతుర్తి, కోదాడల్లో గోదావరి నీళ్లు పారి లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. బసవాపురం ప్రాజెక్టు పూర్తయింది. ఆలేరు, భువనగిరి, రామన్నపేటలకు కూడా వర్షాకాలం తర్వాత నీళ్లు వస్తాయి. ఇక్కడ కూడా రావాలని పనులు మొదలు పెడితే.. ఎందుకు అడ్డంకులు పెడుతున్నారు? పెద్ద పెద్ద మాటలు మాట్లాడే రాజగోపాల్‌ రెడ్డినో, కేంద్ర మంత్రో, ఇంకో పెద్ద మనుషో ఢల్లీికి పోయి మా కృష్ణా జలాలా వాటా ఏంటి? మా శివన్నగూడెం ప్రాజెక్టు ఎప్పుడు నింపుకోవాలి? అని అడగరట. కానీ రేపు డోల్‌ బాజా పట్టుకొని అమిత్‌షాను తీసు కొస్తారట. ఎవడికి కావాలి నీ డోల్‌ బాజా, భజంత్రీ, నీ పెద్దపెద్ద బొమ్మలు? మునుగోడు చైతన్యవంత మైన గడ్డ. కృష్ణా జలాల వాటా ఎందుకు తేల్చరో? కేంద్ర ప్రభుత్వ పాలసీ ఏంటో? విూ దద్దమ్మ చేతగానితనమేంటో మునుగోడులో చెప్పాలని సవాల్‌ చేస్తున్నా. ఒక్క విషయం ఆలోచించండి.. బీజేపీ ప్రభుత్వం వచ్చి 8 ఏండ్లు అయింది. రైతులకు కానీ, మహిళలకు కానీ, దళితులకు కానీ, కార్మికులకు కానీ ఎవరికైనా ఒక్క మంచి పని జరిగిందా? వాళ్లకు మేలు జరిగితే మాకు కనిపించదా? అవి లేవుకానీ.. ఎయిర్‌పోర్టులు, విమానాలు, బ్యాంకులు, రైళ్లు, రోడ్లు, గ్యాస్‌ కంపెనీలు అన్ని వరుసపెట్టి అమ్మడం మొదలు పెట్టారు. కార్పొరేట్‌ వ్యవసాయం చేద్దాం అని చెప్పి రైతుల పొలాల్లో రైతులనే కూలీలుగా పనిచేయించే కుట్ర జరుగుతోంది. తస్మాత్‌ జాగ్రత్త. చిన్నరైతు, పెద్ద రైతు అని లేకుండా అందరికీ లక్షమందికిపైగా రైతు బంధు పథకం అందుతోంది. లక్షమంది రైతులకు ఎంత భూమి ఉంటే అంత అందుతోందన్నారు. వడ్లు కొనుగోలు గురించి గొడవ జరిగే సమయంలో జగదీశ్వర్‌ రెడ్డి, మేం ఎమ్మెల్యేలంతా వెళ్లి ఢల్లీిలో గొడవ చేసినా వడ్లు కొనం అన్నారు. ఫుడ్‌ కార్పొరేషన్‌ను చేతులో పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే మేం ఏం చెయ్యాలి? విలేకరులు లేకుండా చూసి తలుపు పెట్టి పైసలు బర్బాద్‌ చేస్తున్నారు? రైతులకు ఎందుకు ఇస్తున్నారు? వికలాంగులకు, చేనేతకార్మికులకు, గీత కార్మికులకు, ముసలోళ్లకు ఇవ్వొద్దు
అంటారు. వీళ్లందరి నోరు కొట్టి బడా బడా షావుకార్లకు ఇవ్వాలి. ఇదే దేశంలో జరుగుతోంది. నేను చెప్పేది నిజమో కాదో విూ గ్రామంలోకి వెళ్లి ఆలోచించండి. రైతు బంధు అని చెప్పా అందరికీ వస్తోంది. రైతు బీమా అందరికీ వస్తోంది. ఎవరైనా రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడేది. కానీ ఇప్పుడు రైతు ఏ కారణం వల్ల చనిపోయినా పది రోజులు కూడా తిరగకుండానే వాళ్ల ఖాతాలో రూ.5 లక్షలు పడుతోందని కేసీఆర్‌ ధ్వజమెత్తారు. అంతకుముందు భారీ కాన్వాయ్‌తో మునుగోడులో టీఆర్‌ఎస్‌ ప్రజాదీవెన సభకు సీఎం కేసీఆర్‌ చేరుకున్నారు. సభా వేదికపై పార్టీ జెండా ఆవిష్కరించారు. వేదికపై అమరవీరుల స్థుపానికి నివాళులు అర్పించారు. ప్రజాదీవెన సభకు సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు, నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. హైదరాబాద్‌ ప్రగతి భవన్‌ నుంచి బయలుదేరిన సీఎం కేసీఆర్‌.. పార్టీ శ్రేణులతో కలిసి బస్సులో మునుగోడు వెళ్లారు. సీఎం వెళ్లే మార్గమంతా టీఆర్‌ఎస్‌ పార్టీ జెండాలు, ప్లెక్సీలతో సందడిగా నెలకొంది.