మీ న్యూస్ ను మీరే కలెక్ట్ చేసి న్యూస్ ప్రజెంట్ చేస్తే ఆటోమేటిక్ గా మంచి పేరు వస్తుంది:మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

శుక్రవారం మెదక్ టౌన్ లోని తెలంగాణ భవన్ లో  టీయూడబ్లుజే మెదక్ జిల్లా అధ్యక్షులు శంకర్ దయాళ్ చారి అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ ల యూనియన్ టీయూడబ్లుజే ద్వితీయ జిల్లా మహాసభ కు చీఫ్ గెస్ట్ గా హాజరై జర్నలిస్ట్ లను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. సెఫరెట్ తెలంగాణ స్టేట్ కోసం జరిగిన పోరాట సమయంలో ఆంధ్ర యాజమాన్యలను ధిక్కరించి పోరాట స్పూర్తిని తెలిపింది జర్నలిస్ట్ లే అని యాది జేసుకున్నారు. ఈ మధ్య కాలంలో వాట్సప్ వచ్చాక న్యూస్ విలువలు తగ్గిపోయాయని, ఏది నిజం ఏదీ అబద్దమో తెలియడం లేదన్నారు. ఒక న్యూస్ పేపర్, ఒక ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ న్యూస్ ను కలెక్ట్ చేసే టైంలోనే వాట్సప్ లో న్యూస్ మారిపోతుందని ఆమె తెలిపారు. జర్నలిస్ట్ లకు మంచి రోజులు రావాలంటే ఫెక్ న్యూస్ లను ఫార్వార్డ్ చేయొద్దని సూచించారు. జర్నలిస్ట్ హెల్త్ కార్డుల గురించి హెల్త్ మినిస్టర్ హరీష్ రావు దృష్టికి తీసుకుని వెళ్తానని జర్నలిస్ట్ లకు హామీ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండలాల్లో పనిచేస్తున్న జర్నలిస్ట్ లకు గృహ వసతి కల్పించడం పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.టీయూడబ్యూజె ఐ జె యి రాష్ట్ర కార్యదర్శి విరహత్ ఆలీ మాట్లాడుతూ దశాబ్దాలుగా టీ యూ దబ్లు జే యూనియన్ జర్నలిస్ట్ ల హక్కుల పరిరక్షణకు, సమస్యల పరిష్కారం కోసం అవిరళ కృషి చేస్తోందన్నారు. ఎక్కడ ఏ జర్నలిస్ట్ కు ఏ సమస్య, ఆపద వచ్చినా యూనియన్ స్పందించి సహాయ సహకారాలు అందిస్తున్నట్టు తెలిపారు  అర్హులైన విలేకరులు అందరికీ అక్రిడిటేశన్ కార్డులు ఇప్పించేందుకు పోరాటాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.  జర్నలిస్ట్ హెల్త్ కార్డు లు పనిచేసేలా, అన్ని కార్పొరేట్ హాస్పిటల్ లలో క్యాష్ కేస్ ట్రీట్ మెంట్ జరిగేలా ప్రభుత్వం  చర్యలు  తీసుకోవాలని కోరారు. టీ ఎన్ జీ వో జిల్లా అధ్యక్షులు దొంతి నరేందర్, జర్నలిస్ట్ యూనియన్ జిల్లా ప్రధాన కార్య దర్శి అశోక్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శి బొందుగుల నాగరాజు, యూనియన్ బాధ్యులు శ్రీనివాస్ రెడ్డి, ఫారుక్ హుసేన్, వెంకట్ గౌడ్, భూమయ్య, రాజ్ శేఖర్, ఆనంద్, రఘుపతి,  వివిధ మండలాల జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.