ముంపు మండలాల్లో ఎమ్మెల్యే పర్యటన

భద్రాచలం,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): తూర్పు గోదావరి జిల్లాలోని వరద ప్రభావిత గ్రామాలలో భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య శనివారం పర్యటించారు. విలీన మండలాల్లో ఆయన పర్యటించి పరిస్తితిని తెలుసుకున్నారు. గత 30 గంటలుగా జలదిగ్భందనంలో ఉన్న శ్రీరామగిరి గ్రామంలో బాధితుల సమస్యలను అడిగితెలుసుకున్నారు. ఇంత వరకు రెవెన్యూ శాఖ అదికారులు నిత్యవసర సరుకులు ఇవ్వలేదని బాధితులు రాజయ్యకు చెప్పుకొని వాపోయారు. దీంతో రాజయ్య ఐటిడిఎ పిఒతో ఫోన్లో మాట్లాడారు. తక్షణమే బాధితులకు బియ్యం, కిరోసిన్‌, ఇతర నిత్యవసరాలు అందించాలని కోరారు. దీనిపై స్పందించిన పిఒ తక్షణమే సహాయక చర్యలు చేపడతామని ఎమ్మెల్యేకి హామి ఇచ్చారు.