ముగిసిన నామినేషన్ల గడువు

హైదరాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్లకు మధ్యాహ్నం 3 గంటలతో గడువు ముగిసింది. చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మంగళవారం నామినేషన్లను పరిశీలిస్తారు. ఈ నెల 22 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. వచ్చే నెల 7న రాష్ట్రవ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్‌ జరగనుంది. తెలంగాణ సహా దేశంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఫలితాలు వచ్చే నెల 11న వెల్లడించనున్నారు.