మున్సిపల్‌ ఎన్నికలకు ముందస్తు వ్యూహాలు

రంగంలోకి దిగిన మాజీ ఎంపి కవిత
పురపాలికల్లో పాగా వేసేలా చర్చలు
నిజామాబాద్‌,నవంబర్‌9 (జనం సాక్షి):  మున్సిపల్‌ ఎన్నికలకు అతి త్వరలోనే నోటిఫికేషన్‌ రానుండడంతో అధికార పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. మాజీ ఎంపీ కవిత ఆధ్వర్యంలో పలు దఫాలు చర్చలు జరిపారు. మున్సిపల్‌ ఎన్నికలపై అధికార పార్టీ నేతలు గత కొన్ని రోజులుగా మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కవిత ఆధ్వర్యంలో పలు దఫాలు హైదరాబాద్‌లో చర్చించారు. పలు దఫాలు సమావేశాలను నిర్వహిం చారు. మాజీ ఎంపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రితోపాటు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పాల్గొని మున్సిపల్‌ ఎన్నికలపై చర్చించారు. మున్సిపల్‌ ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే విధంగా చర్చలు జరిపారు. సీ ఎం కేసీఆర్‌ ఆదేశించిన విధంగా నిజామాబా ద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌, మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల మున్సి పాలిటీలపైనా వీరు చర్చించారు. రిజర్వేషన్‌ లు ప్రకటించి నోటిఫికేషన్‌ వచ్చిన వెంటనే రంగంలోకి దిగే విధంగా ఈ చర్చలను జరి పారు. మాజీ ఎంపీ కవిత ఆధ్వర్యంలో జరిగి న పలు సమావేశాల్లో మొత్తం మున్సిపా లిటీల్లో మళ్లీ టీఆర్‌ఎస్‌ పార్టీ జెండా ఎగురవే సే విధంగా ప్రయత్నాలను మొదలుపెట్టారు. అన్ని ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అత్యధిక సీట్లను కై వశం చేసుకున్నందున మొత్తం మున్సిపాలిటీలను గెలిపించుకునే విధంగా చూడాలని సీఎం ఆదేశించడంతో వీరు తీవ్ర ప్రయత్నా లు కొనసాగిస్తున్నారు. పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లో మళ్లీ పాగా వేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.రిజర్వే షన్‌లను ప్రకటించిన వెంటనే అభ్యర్థులను బరిలోకి దించేందుకు సన్నద్దాలు చేస్తున్నారు. అన్ని మున్సిపాలిటీల పరిధిలో మెజారిటీ వార్డులు కైవశం చేసుకునే విధంగా నేతలతో చర్చిస్తున్నారు. కొత్తవారికి సైతం ఈ దఫా అ వకాశం ఇచ్చేందుకు పరిశీలిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలకు ధీటుగా మెజారిటీ స్థానాలను గెలుచుకునే విధంగా వ్యూహాలను రచిస్తున్నారు. నోటిఫికేషన్‌ రాగానే బరిలోకి దిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు సన్నాహకంగా ముందస్తుగా నేతలు చర్చించి, మున్సిపల్‌ ఎన్నికల్లో భారీ మెజారిటీని సాధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అన్ని మున్సి పాలిటీల పరిధిలో టీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు లేరు. నిజామాబాద్‌ కార్పొరేషన్‌ పరిధిలో అర్బన్‌, రూరల్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరి ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరుగను న్నాయి. మెజారిటీ 50 వార్డులు అర్బన్‌ ఎమ్మెల్యే పరిధిలో ఉన్నాయి. వీటితోపాటు మిగిలిన పది వార్డులు రూరల్‌తో పాటు ఆర్మూర్‌ ఎమ్మెల్యే పరిధిలో ఉన్నాయి. బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌ మున్సిపాలిటీలు ఆయా నియోజక వర్గాల ఎమ్మెల్యేల పరిధిలోనే ఉన్నాయి. భీమ్‌ గల్‌ నుంచి మంత్రి ప్రాతినిధ్యం వహిస్తు న్నారు. కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీలు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేల పరిధిలో ఉండగా, జగిత్యాల కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే పరిధిలో ఉన్నాయి. మున్సిపాలిటీల గెలుపు బాధ్యతను కూడా ఎమ్మెల్యేలకే అప్పగించనున్నారు. వీరి ఆధ్వర్యంలో మాజీ ఎంపీ కవిత పర్యవేక్షణలో కొనసాగనున్నాయి. మున్సిపల్‌ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అధికార పార్టీకి
చెందిన ఎక్కువమంది నేతలు హైద రాబాద్‌కు తరలివెళుతూ, మాజీ ఎంపీ కవిత తోపాటు మంత్రి
ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌, బిగాల గణెళిష్‌ గుప్త, షకీల్‌ అవిూర్‌, విద్యాసాగర్‌రావు, డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ను కలిసి వస్తున్నారు. వీరి తోపాటు మరికొంత మంది నేతలు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కలిసి ము న్సిపల్‌ ఎన్నికల్లో తమకు అవకాశం కల్పించా లని కోరుతున్నారు. ఎన్నికలకు ఏ క్షణమైనా నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉండడంతో ముందస్తుగా అధికార పార్టీ నేతలు ప్రయ త్నాలు మొదలుపెట్టారు. వీరితోపాటు మొన్నటి వరకు పదవులు అనుభవించిన నేతలు కూడా ప్రయత్నాల్లో కొనసాగించడంలో ముందు వరుసలో ఉన్నారు.