ముషంపల్లి ఘటన అమానుషం

ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ద్వారా సత్వర విచారణ
నల్లగొండ,సెప్టెంబర్‌23 (జనంసాక్షి) : నల్లగొండ మండల పరిధిలోని ముషంపల్లి ఘటన అమానుషం అని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు. గురువారం ఉదయం జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానకు చేరుకున్న ఆయన మృతురాలి భౌతికకాయానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మృతురాలికుటుంబ సభ్యులను పరమార్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి విూడియాతో మాట్లాడుతూ.. ముషంపల్లి ఘటన ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ జరుగుతుందని వెల్లడిరచారు. దుండగులకు శిక్ష పడేలా ఆధారాలు సేకరిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ తరహా ఘటనలపై ప్రజల్లో స్పందన రావాలని మంత్రి జగదీష్‌రెడ్డి పిలుపునిచ్చారు. ముషంపల్లి ఘటనపై గ్రామ ప్రజల స్పందన ఇతరులకు మార్గదర్శనం కావాలని ఆయన విజ్ణప్తి చేశారు. మంత్రి జగదీష్‌ రెడ్డి వెంట నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్‌ ఉప్పల శ్రీనివాస్‌, నల్లగొండ మున్సిపల్‌ చైర్మన్‌ మందాడి సైదిరెడ్డి, మిర్యాలగూడ మున్సిపల్‌ చైర్మన్‌ తిరునగరి భార్గవ్‌ డిఐజి ఏవీ రంగనాధ్‌, తదితరులు పాల్గొన్నారు.