మూడు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా

మూడు ఈశాన్య రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది ఈసీ. త్రిపుర, నాగాల్యాండ్, మేఘాలయల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుపాలని నిర్ణయించింది. త్రిపురలో ఫిబ్రవరి 18న, నాగాలాండ్, మేఘాలయాల్లో ఫిబ్రవరి 27 ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మూడు రాష్ట్రాల్లో మార్చి 3న కౌంటింగ్ నిర్వహిస్తారు. త్రిపుర, నాగాల్యాండ్, మేఘాలయాల్లో ఒక్కో రాష్ట్రంలో 60 అసెంబ్లీ స్థానాలున్నాయి. మూడు రాష్ట్రాల్లో ఈవీఎంలకు వీవీ ప్యాట్ మిషన్లను ఏర్పాటు చేస్తామని  ప్రధాన ఎన్నికల కమిషనర్ అచల్ కుమార్ జ్యోతి తెలిపారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తయిందని, సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నామినేషన్ల నుంచి పోలింగ్ వరకు మైక్రో అబ్జర్వర్లు ప్రక్రియను పర్యవేక్షిస్తారని చెప్పారు.