మూడు సీట్లలో సిపిఐ అభ్యర్థుల ప్రకటన

హుస్పాబాద్‌ నుంచి చాడ, బెల్లంపల్లి నుంచి గుండా మల్లేశ్‌

వైరా బరిలో బానోత్‌ విజయబాబు పోటీ

హైదరాబాద్‌,నవంబర్‌14(జ‌నంసాక్షి): సీపీఐ తమకు కేటాయించిన మూడు స్తానాల్లో అభ్యర్థుల జాబితాను బుధవారం ప్రకటించింది. ఇందులో భాగంగా గతంలో బెల్లంపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించిన గుండా

మల్లేశ్‌ను మరోమారు అక్కడి నుంచి బరిలోఎకి దింపాలని నిర్ణయించింది. అభ్యర్థుల వివరాలను పార్టీ నేత పల్లా వెంకట్‌రెడ్డి ప్రకటించారు. హుస్నాబాద్‌ నుంచి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, వైరాలో బానోతు విజయబాయి, బెల్లంపల్లి నుంచి గుండా మల్లేష్‌ బరిలోకి దిగనున్నారు. కేటాయించిన మూడు సీట్ల నుంచి సీపీఐ బరిలోకి దిగుతుందని పార్టీనేత పల్లా వెంకట్‌రెడ్డి తెలిపారు. తమ పార్టీ అభ్యర్థులు 17,18 తేదీల్లో నామినేషన్లు వేస్తారని వెంకటరెడ్డి వెల్లడించారు. మహాకూటమికి ఆదరణ పెరిగిందన్నారు. తమకు కేటాయంచిన మూడు సీట్లలో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపార్టీలో తిరుగుబాటు అభ్యర్థులు లేకుండా చూసే బాధ్యత ఆయా పార్టీలదే అని చెప్పారు. మూడు సీట్ల కోసం సీపీఐ ఆత్మహత్య చేసుకొందని సీపీఎం నేత తమ్మినేని వ్యాఖ్యానించడాన్ని కొట్టి పారేశారు. ఎన్నికల తర్వాత ఎవరు ఆత్మహత్య చేసుకొన్నారో తెలుస్తుందన్నారు.