మూడేళ్లలో 70 శాతం ప్రాజెక్టుల పూర్తి – కేసీఆర్.

మహబూబ్ నగర్ : మూడేళ్లోలో 70 శాతం ప్రాజెక్టులు పూర్తి చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. భూత్పూరులో నిర్వహించిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. రూ.35,200 కోట్లతో ఎత్తిపోతల ప్రాజెక్టు చేపట్టడం జరుగుతోందని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రాజెక్టు నిర్మాణంపై అడిగే హక్కు ఏపీకి లేదని, ఏపీ మంత్రులు చూస్తుండగానే ప్రాజెక్టును పూర్తి చేస్తానన్నారు. కోటి మంది చంద్రబాబులు కొంగజపం చేసినా సరే పాలమూరు ప్రాజెక్టును కట్టి తీరుతామని స్పష్టం చేశారు.