మృతి చెందిన దంపతుల గుర్తింపు

ఖమ్మం,జూన్‌11(జ‌నం సాక్షి): ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దంపతులను గుర్తించారు. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు వాడపల్లి గాంధీ(28), వెంకటేశ్వరమ్మ(23)గా గుర్తించారు. కాగా ఈ ప్రమాదం నుంచి వారి పిల్లలు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యారు. మృతులు దమ్మపేట మండలం మొద్దులగూడెం వాసులుగా తెలుస్తోంది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.