మృతుల కుటుంబాలకు సహాయం అందజేత

జోగులాంబ గద్వాల,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  ఈ ఏడాది మే నెలలో ఏపీలోని కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న ఘటనలో బాధిత కుటుంబాలకు పరిహారం అందించారు. వోల్వో బస్సు- ఎస్‌యూవీ కారు ఢీకొని 16 మంది మృతిచెందారు. మృతులంతా జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురానికి చెందిన నివాసులు. మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆదుకుంటామని హావిూ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాద మృతులకు సీఎం సహాయనిధి చెక్కులను తాజాగా పంపిణీ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున సీఎం సహాయనిధి చెక్కును ఎమ్మెల్యే అందజేశారు.