మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం

మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం

వరంగల్: సమ్మక్క సారక్క జాతర అనంతరం మేడారంలో ఏర్పాటు చేసిన హుండీల లెక్కింపు కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది.

మేడారం అమ్మల గద్దెల వద్ద దేవాదాయశాఖ అధికారులు 22 హుండీలను ఏర్పాటు చేశారు. మేడారం ఎండోమెంట్ కార్యాలయం ఆవరణలో పూజారుల సమక్షంలో లెక్కింపును ప్రారంభించారు. అంతకు ముందు పూజారులు అమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.