మేడ్చల్, నేరేడుచర్ల మున్సిపల్ పీఠాలు టీఆర్ఎస్ పార్టీ కైవసం

నేరేడుచర్లలో కాంగ్రెస్ కు నేరేడుచర్లలో కాంగ్రెస్ కు భంగపాటు

ఎక్స్ అఫీషియోగా ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పేరు ఛైర్మన్‌గా చందమల్లు జయబాబు ఎన్నిక

ఎన్నికను బహిష్కరించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ

సూర్యాపేట, జనవరి 27(జనంసాక్షి): రాష్ట్ర వాప్తంగా ఉత్కంఠ రేపిన నేరేడుచర్ల మున్సిపల్ పీఠం అధికార టీఆర్ఎస్ పార్టీనే కైవసం చేసుకుంది. తగిన మెజారిటీ లభించడంతో టీఆర్ఎస్ కు చెందిన చందమల్లు జయబాబు ఛైర్మన్ గా ఎన్నిక య్యారు. అయితే ఛైర్మన్ ఎన్నిక చివరి మేడ్చల్, నేరేడుచర్ల మున్సిపల్ పీఠాలు టీఆర్ఎస్ కైవసం వరకు నేరేడుచర్ల మున్సిపల్ కార్యాలయం వద్ద యుద్ధ వాతావరణం తలపించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డికి ఎక్అఫీషియో ఓటు హక్కు కల్పించడంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం తెలిపింది. అంతేకాకుండా ఆయనను కార్యాలయం నుంచి బయటకు పంపించి నిన్నటి జాబితా ప్రకారమే ఎన్నిక ప్రక్రియ చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయితే ఈసీ ప్రకటించిన కొత జాబితా ప్రకారమే ఎనిక పక్రియ చేపడతామని అధికారులు స్పష్టం చేయడంతో కాంగ్రెస్ సభ్యులు ఎన్నికల నుంచి వాకౌట్ చేశారు. దీంతో ఏడుగురు కౌన్సిల్ సభ్యులు, నలుగురు ఎస్ఎఫీషియో ఓట్లతో టీఆర్ఎస్ నేరేడుచర్ల మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఎన్నికల పక్రియ నుంచి బయటకు వచ్చిన కాంగ్రెస్ రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టింది. దీంతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమాలతో ఛైర్మన్ పదవిని దక్కించుకోవడానికి తెరాస ప్రయత్నిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రాంతానికి సంబంధంలేని వ్యక్తిని ఎక్స్ అఫిషియో సభ్యుడిగా చేర్చారని విమర్శించారు. సమావేశం జరుగుతున్న కోల్‌ సమయంలో ఇరు పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎన్నికల పరీశీలకులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఎదుటే ఇరుపార్టీల నేతలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికను కాంగ్రెస్ బహిష్కరించింది. ఇరుపార్టీలు ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం తెరాస సభ్యులతోనే సమావేశం నడిపించారు. అంతకుముందు ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డిని ఎక్అఫిషియో జాబితాలో చేర్చడంపై ఉత్తమ్ కుమార్‌ రెడ్డి ఖండించారు. ఎస్ఈసీ జరిగినదిఅధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎన్నికలే నిర్వహించకపోతే పోటీ ఉండేది కాదు కదా అని మండిపడ్డారు. కేటీఆర్ ఎన్నికల అక్రమాలకు నేరేడుచర్ల మున్సిపల్ ఎన్నికలే రోడ్డుపై జాగ్రత్తగా నిదర్శనం. 25వ తేదీ వరకే ఎక్అఫిషియో సభ్యుల నమోదు జరగాలని నిబంధనలు ఉన్నాయి. ఈ రోజు నేరేడుచర్ల మున్సిపల్ సభ్యులుగా ఎమ్యెల్సీ సుభాష్ రెడ్డి పేరు నమోదు చేయిస్తున్నారు. ఇది అక్రమం, నిబంధనలకు విరుద్ధం. ఇక ఎన్నికలు ఎందుకు.. కేటీఆర్ ఇంట్లో కూర్చుని రాసుకుంటే సరిపోతుంది కదా..? అని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. నేరేడుచర్ల మున్సిపల్ ఛైర్మెన్ ఎన్నికల వ్యవహారాన్ని మంగళవారం ప్రారంభించారు. ఇద్దరు సభ్యులు కూడా ప్రమాణం చేశారు. అప్పుడు ఎమ్యెల్యే గొడవ చేసి వాయిదా వేయించారు. ఇప్పుడు కొత్తగా సభ్యులను నమోదు చేయిస్తున్నారు. ఇది ఎన్నికల అక్రమాలకు పరాకాష్ట. 25వ తేదీ లోపు ఎక్స్ అఫిషియో సభ్యుల నమోదు చేయించాలని నాకే స్వయంగా మున్సిపల్ శాఖ కార్యదర్శి, ఎన్నికల కమిషనర్ చెప్పారు, మరి ఎన్నికల పక్రియ ప్రారంభమై కొంత జరిగిన తర్వాత ఇప్పుడు కొత్త సభ్యుల నమోదు ఏంటి..? ఇంత దారుణ అక్రమాలు ఉంటాయా..? రాష్ట్రంలో కేటీఆర్ అక్రమాలు శ్రుతి మించిపోయాయి.. ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో ప్రజాస్వామ్య వాదులు, గోలివాడ మేధావులు, ప్రజలు గమనించాలి, అర్థం చేసుకోవాలని ఉత్తమ్ కుమార్ అన్నారు. ‘కాళేశ్వరం’, మిషన్ భగీరథలకు సాయం అందించండి – జాబితాలో చేర్చడంపై ఉత్తమ్ కుమార సహించకపోతే పోటీ మోపారు, మరి ఎన్నికల పక్రియ ప్రారంటాయా..? రాష్ట్రంలో కేటీఆర్ గోలివాడ