మేడ్చెల్‌లో జెండా ఎగురవేసిన నాయిని

మేడ్చెల్‌,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): 72వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మేడ్చల్‌ జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో మంత్రి నాయిని నర్సింహారెడ్డి జండా ఆవిష్కరణ చేశారు. ఈ ఏడాది ఉత్తమ విలేకరిగా ఎన్నికైన దామరపల్లి నర్సింహారెడ్డి కి ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్‌ రెడ్డి, కలెక్టర్‌ ఎం.వి రెడ్డి జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి,రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ లు పాల్గొన్నారు

—————