మొక్కలు నాటిన ఎస్‌ఐ

కడప,జూలై21(జ‌నం సాక్షి): చెట్లను నాటి పర్యావరణాన్ని పరిరక్షిచాలని ఎస్‌ ఐ ప్రసాద్‌ అన్నారు. శనివారం ఆయన రొంపిచెర్ల మండలం,స్థానిక కెజిబీవీ పాఠశాలలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్‌ పి రాజశేఖర్‌ బాబు అదేశాలమేరకు చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఒక్కో విద్యార్థికి ఒక్కొక్క మొక్క చొప్పున పంపిణీ చేశామన్నారు. అనంతరం మొక్కను నాటి నీరు పోశారు.అలాగే విద్యార్థులకు నీటి సమస్య లేకుండా చేసేందుకు తొట్టి నిర్మాణ పనులను ప్రారంభించారు.