మోడీ చిత్తశుద్దికి మహిళా బిల్లు పరీక్ష 

ఇక కారణాలు చెప్పుకోవడానికి ఏవిూ లేదు. ఎవరి కారణంగా మహిళా బిల్లు ఆగిపోయిందనడానికి లేదు. మోడీ ప్రబుత్వానికి సంపూర్ణ బలమున్నది. అన్నింటికి మించి ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్‌ పార్టీ బేషరతుగా బిల్లుకు మద్దతు ఇస్తామని ప్రకటించింది. రాహుల్‌గాంధీ ఈ మేరకు ప్రధాని మోడీకి లేఖ కూడా రాశారు. దీంతో ఇప్పుడు చిత్తశుద్దితో బిల్లును గట్టెక్కించే బాధ్యత మోడీపైనే ఉంది. గతంలో లాగా కారాణలు లేదా సాకులు చూపే సమయమిది కాదు. అలా చే/-తే ఇక బిజెపిని పూర్తిగా నమ్మరు. నాలుగేళ్లుగా దీనిపై మాటమాత్రంగా అయినా మాట్లాడకుండా నెట్టుకొస్తున్న ప్రధాని మోడీ ఇక ఏ మాత్రం జాప్యం చేయకుండా ఈ సమావేశాల్లోనే బిల్లు పెట్టి పాస్‌ చేయించే బాధ్యత తీసుకోవడం ద్వారా భారతీయ మహిళలకు భరోసా కల్పించాలి. భారత రాజకీయాల్లో మహిళలు కీలక భూమిక పోషిస్తున్నా గత రెండున్నర దశాబ్దాలుగా మహిళా బిల్లు మాత్రం గట్టెక్కలేకపోతోంది. లోక్‌సభలో సంపూర్ణ మెజార్టీ ఉన్నా మోడీ ప్రభుత్వం దీనిని ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేయడం లేదు. గతంలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలుగా ఉన్న సోనియాగాంధీ మహిళా బిల్లును గట్టెక్కించాలని ప్రధాని మోడీకి లేఖరాశారు. తాజాగా ఎఐసిసి అధ్యక్షుడి ¬దాలో రాహుల్‌ కూడా లేఖ రాశారు. అయితే మోడీ మనసులో మహిళా బిల్లుకు సంబంధించిన ఆలోచనలను వెల్లడి కావడం లేదు. అనేక సదస్సులు, సమావేశాల్లో ప్రధాని మోడీ మహిళల ఔన్నత్యం గురించి మాట్లాడుతున్నా పార్లమెంటులో మాత్రం బిల్లు రావడం లేదు. దీంతో గత నాలుగేళ్లుగా ఇది కోల్డ్‌ స్టోరేజిని దాటి రావడం లేదు. మోడీ ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లు అయినా మహిళా బిల్లుకు అతీగతీ లేదు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వివక్షలపై స్పందించడం లేదు. త్వరలోనే మహిళల రిజర్వేషన్లపై ముందుకు సాగుతామన్న ఆకాంక్ష అలాగే ఉండిపోయింది. పాలనలో వారికి భాగస్వామ్యం కల్పించకుండా వారిని అణగదొక్కే కుట్రల్లో బిజెపి కూడా ముందే ఉంది. అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలను ఎందుకనో రాజకీయంగా ముందుకు సాకుండా అణగదొక్కుతున్నారు. ఇలా వారిని అణచి వేయడం వల్ల 50శాతం జనాభా ఆకాంక్షలను కాలరాస్తున్న వారు అవుతున్నారు. మహిళా సాధికారతతో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా పాలన సాగాలి. చట్టసభల్లో మూడోవంతు రిజర్వేషన్లు ఎవరి దయాధర్మంగానో కాకుండా హుక్కుగా, సగౌరవంగా లభించాల్సి ఉంది. మహిళలకు సముచిత భాగస్వామ్యం కల్పించినప్పుడే సామాజిక ప్రగతి సాధ్యపడు తుంది. ఏకాభిప్రాయ సాధన, ఉపకోటా పేరిట ఇంతకాలం రాజకీయం చేస్తూ వచ్చారు. ఇప్పటికే రాజ్యసభ ఆమోదం పొందిన మహిళాబిల్లుకు లోక్‌సభలో మద్దతు పలికే పార్టీల్ని కూడగట్టే యత్నాలను చేయాలి. మహిళల హక్కుల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోకుండా చూడాలి. ప్రజాస్వామ్యంలో కేవలం అధికారపక్షమే కాదు ప్రతిపక్షాలకూ, ప్రజలందరికీ పాత్ర ఉంటుంది. ఇది గమనించి అందరూ ముందుకు సాగాలి.మహిళల గొప్పతనాన్ని భారీతీయ మహిళల ఆదర్శాలను ప్రముఖంగా ప్రస్తావించిన ప్రధాని ఈ సారయినా మహిళా బిల్లుకు మోక్షం కలిగించాలి. ముద్రా పథకంతో దేశంలో మహిళల స్థితిగతులు మారిపోతున్నట్లు చెప్పడం కాకుండా ..వారికి అధికారం కూడా అప్పగించాలి. మహిళలు సాధిస్తున్న విజయాలు, వారికిస్తున్న ప్రోత్సాహకాలను ఏకరువు పెట్టడం పక్కన పెట్టి చిత్తశుద్ది చాటాలి. సమాన అవకాశాలు, సముచిత గౌరవం, సాధికారిత స్వప్నం అమల్లోకి వస్తేనే మహిళా లోకానికి సాకారమయ్యేది. అవసరమైన చర్యలు తీసుకోవడానికి బదులుగా మొక్కుబడి చర్యలకు పాలకవర్గాలు పరిమితం కావడమే ఈ పరిస్థితికి కారణం. వారికి చట్టసభల్లో సముచిత గౌరవం దక్కాలి. వారికి ్గ/ళిరిజర్వేషన్లు రావాలి. అప్పుడే తమ సమస్యలపై

మహిళలు గళమెత్తే అవకాశం ఉంటుంది. ఇన్ని అవరోధాల మధ్య కూడా తమతమ రంగాలలో శక్తిమంతమైన మహిళగా నిరూపించుకుంటూనే ఉంది. వ్యక్తిత్వ హననం జరుగుతున్నా.. సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటూనే ఉంది. మహిళా భ్యుదయమే దేశాభ్యుదయం. మహిళా సమానత్వమే సమాజానికి హితం చెబుతున్న పాలకులు సమాన గౌరవం ఇచ్చి చట్టసభల్లో ప్రవేశించేలా చేయడంలో మాత్రం విఫలం అవుతున్నారు. మహిళల్లో స్ఫూర్తిని నింపడమే గాకుండా, వారిలో ఆత్మస్థయిర్యాన్ని నింపి వారిని మనతో సమానంగా ముందుకు తీసుకుని వెళ్లడంలో పురుష సమాజం విఫలమయ్యిందనడంలో సదేహం లేదు. మహిళాబిల్లుకు మద్దతు ఇస్తామని టిఆర్‌ఎస్‌ కూడా ఇటీవల ప్రకటించింది. అయితే బిసిల ఉపకోటా పేరుతో దీనిని అడ్డుకోవాలనుకోకుండా నేరుగా ముందు బిల్లులకు ఆమోదం పలకాలి. ప్రభుత్వాలు ఏకపక్ష ధోరణితో మహిళలను విభజించి పాలిస్తుంచే తీరు పక్కన పెట్టకుంటే అది ఎంత మాత్రం సాధికారత సాధనకు ఉపయోగపడదు. ఈ పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో మహిళా బిల్లుకు తొలి ప్రధాన్య అంశంగా గుర్తించాలి. లోక్‌సభలో తగిన బలం ఉంది కనుక ప్రధాని మోడీయే ఇందుకు చొరవ తీసుకుని మహిళా బిల్లును గట్టెక్కించి భారతీయ మహిళలకు సంక్రాంతి కానుక ఇవ్వాలి. అన్నిపక్షాలు దాదాపుగా ఏకాభిప్రాయంతో ఉన్నందున మోడీ ముందుకు వచ్చి చిత్తశుద్దిని ప్రదర్శించాలి.