మోతె నా స్వగ్రామం లాంటింది రూ.2.50 కోట్లతో మోతె వీధుల అభివృద్ధి : కేసీఆర్‌

5toqlz3lనిజామాబాద్‌: జిల్లాలోని మోతె గ్రామంలో హరితహారం కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి ప్రకాశ్‌జవదేకర్‌, రాష్ట్ర మంత్రులు జోగురామన్న, పోచారం శ్రీనివాస్‌, ఎంపీలు కవిత, సుమన్‌తో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మోతె జెడ్పీ స్కూల్ గ్రౌండ్‌లో కేసీఆర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మోతె గ్రామంపై వరాల జల్లు కురిపించారు. మోతె గ్రామపంచాయతీ కార్యాలయ నిర్మాణానికి…రూ. 80 లక్షలు మంజూరు చేశారు. మోతెను 100 శాతం డ్రిప్‌ ఇరిగేషన్‌ విలేజ్‌గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. గ్రామానికి 250 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.