యధాతథంగా గ్రూప్‌-2 ఇంటర్వ్యూలు

జోక్యంచేసుకోలేమన్న సుప్రీం
హైదరాబాద్‌,జూలై22 (జ‌నంసాక్షి):  తెలంగాణలో గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నిర్వహించనున్న ఇంటర్వ్యూలు యథావిధిగా కొసాగనున్నాయి. గ్రూప్‌-2 ఇంటర్వ్యూలను నిలిపివేయాలంటూ గతంలో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సరిగ్గానే ఉన్నాయని, అందులో జోక్యం అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ సమస్యను ఇంతటితో ముగిద్దామని జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ ఇందిరా బెనర్జీల ధర్మాసనం స్పష్టం చేసింది. టీఎస్‌పీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్‌-2 ఇంటర్వ్యూలు నిలిపివేయాలంటూ గతంలో పలువురు పిటిషన్‌ దాఖలు  చేసిన విషయం తెలిసిందే.