యాచారం మండలంలో ఉత్సాహంగా గ్రామ సమావేశాలు

తెలంగాణ రాష్ట్ర సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం
పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు
మరింత ముందుకు తీసుకెళ్తామని కార్య కర్తల భరోసా
 ఇబ్రహింపట్నం శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆదేశానుసారం.యాచారం మండల పార్టీ సూచన మేరకు మండలంలోని తాడిపర్తి గ్రామంలో గ్రామశాఖ సమావేశం జరుపుకున్నారు గ్రామశాఖ సమావేశం ముగిసిన అనంతరం టిఆర్ఎస్ (బిఆర్ఎస్) పార్టీ గ్రామశాఖ కార్యకర్తల ప్రొఫైల్స్ ను యాచారం మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు కర్నాటి రమేష్ గౌడ్, పాశ్చ బాషా లకు  గ్రామశాఖ అధ్యక్షుడు మల్లేష్, కార్యదర్శి పాండు, 50 మంది కార్యకర్తల ప్రొఫైల్ పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు పరికిషన్ రెడ్డి, గ్రామ ప్రజా ప్రతినిధులు, పిఏసిఎస్ డైరెక్టర్ శశికళ, పార్టీ ముఖ్యలు, పార్టీ నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు మరియు పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.