యాదాద్రిలో బస్సు బీభత్సం

బస్సు ఢీకొని మహిళ మృతి

యాదాద్రి భువనగిరి,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): యాదగిరిగుట్ట సవిూపంలోని సురేంద్రపురి వద్ద జరిగిన రోడ్డుప్రమాదం ఓ మహిళను బలితీసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఆ మహిళను.. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలిని సంగీత(60)గా పోలీసులు గుర్తించారు. గత 10 నెలల నుంచి సురేంద్రపురిలోని ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రంలో సంగీత వంటమనిషిగా పని చేస్తున్నారు. మహిళను ఢీకొట్టిన బస్సు పికెట్‌ డిపోకు చెందినతదిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.