యాదాద్రీశుడికి సువర్ణపుష్పాలు బహుకరణ

యాదాద్రి భువనగరి,జనవరి28(జ‌నంసాక్షి): యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామికి కానుకగా సువర్ణ పుష్పాలు అందాయి. హైదరాబాద్‌కు చెందిన శకుంతలమ్మ అనే భక్తురాలు బంగారు పుష్పాలను బహుకరించారు. సోమవారం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని, స్వామి వారి సువర్ణపుష్పార్చన పూజ కోసం మూడు బంగారు పుష్పాలను ఆమె బహుకరించారు. 28 గ్రాములు ఉన్న బంగారు పుష్పాలను యాదాద్రిలో ఆలయ అధికారులకు ఆమె అప్పగించారు. ఈ సందర్భంగా శకుంతలమ్మ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి బంగారు పుష్పాలను బహుకరించడం తన అదృష్టమని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెను ఆశీర్వదించి తీర్థప్రాసదాలు అందించారు.