యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

కర్నూలు,జూన్‌20(జ‌నం సాక్షి ): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలో ఓం శాంతి బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కేంద్రంలో బుధవారం యోగా సాధకులు బాల చంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గురువు బాలచంద్ర మాట్లాడుతూ.. యోగా ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. ప్రస్తుతం యోగాకు అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ పెరిగిందని ప్రతి ఒక్కరు యోగా సాధన చేసేందుకు ముందుకు వస్తున్నారన్నారు. వివిధ యోగా ఆసనాలు వేసి వీక్షకులను అబ్బురపరిచారు. కార్యక్రమంలో కేంద్రం బాధ్యురాలు నిర్మలమ్మ, శిష్యులు పాల్గొన్నారు. స్థానిక రెడ్డీస్‌ కల్యాణ మండపంలో రేవా అష్టాంగ్‌ యోగా సంస్థ నిర్వాహకురాలు పద్మజా రెడ్డి.. మహిళలకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహించారు. దాదాపు 60 మంది మహిళలు శిక్షణలో పాల్గొన్నారు.