రంగారెడ్డి జిల్లాలో పేలుడు పదార్థాలు స్వాధీనం

రంగారెడ్డి : జిల్లాలోని చెంగిచెర్లలో అనుమతి లేని లేఔట్‌లో పేలుడు పదార్థాలను పోలీసులు పట్టివేశారు. 28 డిటోనేటర్లు, 50 కిలోల కాల్షియం హైడ్రాక్సైడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలు నిల్వ ఉంచిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. మరో వ్యక్తి పరారీ అయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.