రక్తదానంపై మరింత అవగాహన పెరగాలి

వీలైనన్ని ఎక్కువ శిబిరాలు పెట్టాలి

మంత్రి లక్ష్మారెడ్డి పిలుపు

వరల్డ్‌ బ్లడ్‌ డోనర్‌ డే సందర్బంగా ర్యాలీ

హైదరాబాద్‌,జూన్‌14(జ‌నం సాక్షి): రక్తదానం విూద విస్తృతంగా ప్రచారం జరగాలని,. వీలైనాన్ని ఎక్కువ రక్తదానం శిబిరాలు పెట్టి రక్తదానాన్ని ప్రోత్సహించాలని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ సి లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ ఆధ్వర్యంలో వరల్డ్‌ బ్లడ్‌ డోనర్‌ డే సందర్బంగా నిజాం కాలేజీ గ్రౌండ్‌ లో నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. గీవ్‌ బ్లడ్‌ సేవ్‌ లైఫ్‌అనే నినాదంతో వరల్డ్‌ బ్లడ్‌ డోనర్‌ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ… అన్ని దానాల్లోకి అవయవ దానం గొప్పది అందులో రక్తదానం మరి గొప్పది. ఎమ్జ్గం/న్సీలో ఉన్న వాళ్లకు రక్తం దానం చేయడం వల్ల ప్రాణాలు కాపాడవచ్చు. ఒకరు ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని తెలిపారు. రక్తదానం వల్ల ఎలాంటి నష్టాలు లేవు. పైగా మరింత ఆరోగ్యంగా తయారు అవుతారు 4 లక్షల యూనిట్ల బ్లడ్‌ అవసరం ఉంటుండగా, 60 శాతం మాత్రమే డోనర్స్‌ ద్వారా వస్తున్నది. మిగతా 40 శాతం కూడా డోనర్స్‌ ద్వారా రక్తం అందే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి ఒక్కరు పుట్టిన రోజు, పెళ్లి రోజు… ఇలా ఎదో ఒక రోజున రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. నేను నా ప్రతి పుట్టిన రోజున రక్తదాన శిబిరాలు నిర్వహించి నేను, మా కుటుంబ సభ్యులు రక్తదానం చేస్తున్నాం. గత 15 ఏళ్లుగా ఈ పద్ధతిని కొనసాగిస్తున్నానని తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంచి చైతన్య పరచాలి. ఏజెన్సీ, వెనుకబడిన ప్రాంతాల్లో రక్త హీనత ప్రజల్లో ఎక్కువగా ఉంటున్నది. గర్భిణీలు ఎక్కువగా రక్త హీనతతో బాధపడుతున్నారు. గర్భిణీలలో రక్తహీనత నివారణకు ప్రభుత్వం నడుం బిగించింది. గర్భిణీలకు పౌష్టిక ఆహారం అందిస్తున్నాం. రక్తహీనత ఉన్న గర్భిణీలకు ప్రసవ సమయాల్లో రక్తం అవసరంఅవుతున్నది. కేసీఆర్‌ కిట్స్‌ పథకం వచ్చాక ప్రసవాలు ఎక్కువగా ప్రభుత్వ దవాఖానాల్లోనే అవుతున్నాయి. రక్తదానాన్ని ప్రోత్సహిస్తే, ప్రసవ సమయాల్లో తల్లుల మరణాలను తగించవచ్చు. అలాగే అవయవదానం ని కూడా ప్రోత్సహించాలి. ఇప్పటికే బ్లడ్‌ బ్యాంక్స్‌ సహా, ఐ బ్యాంక్స్‌ ని పెడుతున్నాం. నిన్ననే సరోజని ఐ హాస్పిటల్లో దక్షిణ భారత దేశంలోనే మొదటిసారిగా మన రాష్ట్రంలో ఐ బ్యాంకు ని ప్రారంభించాం. అవయవ దానాల్లో మన రాష్ట్రం దేశానికే అదర్శంగా నిలుస్తోంది. రక్తదానం చేద్దాం…అవరమైన వాళ్ళ ప్రాణాలను కాపాడుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎయిడ్స్‌ కంట్రోల్‌ బోర్డ్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ ప్రీతి విూనా, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.