రాగితీగ చోరీల ముఠా అరెస్ట్
ఆదిలాబాద్,డిసెంబర్10(జనంసాక్షి): విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల నుంచి రాగితీగను దొంగలిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ విష్ణువారియర్ తెలిపారు. నిందితుల నుంచి రూ.5.65 లక్షల విలువైన రాగి తీగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు మహారాష్ట్రలో నిందితులు చోరీలకు పాల్పడినట్లు ఎస్పీ వెల్లడించారు.