రాజకీయాల్లో చేరలేదన్న విష్ణురాజు

అమరావతి,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): ఈ నెల 5వ తేదీన జనసేన పార్టీ అడ్వయిజరీ కౌన్సిల్‌ చైర్మన్‌ గా విష్ణురాజుని నియమిస్తున్నట్టు పవన్‌ కల్యాణ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, తాను జనసేన పార్టీలో చేరినట్లు వస్తున్న వార్తలను ఖండించారు విష్ణు విద్యాసంస్థల చైర్మన్‌ విష్ణురాజు.. తాను జనసేన పార్టీలో చేరలేదని.. రాజకీయాల్లోకి రాను, ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారాయన. కేవలం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సిద్ధాంతాలు నచ్చి అడ్వయిజరీ కమిటీలో సలహాలు ఇచ్చేందుకే అంగీకరించానని క్లారిటీ ఇచ్చారు. విద్యా, వైద్య, ఉపాధి రంగాల అభివృద్ధి విషయంలో సహకరించేందుకే కమిటీకి చైర్మన్‌గా బాధ్యత తీసుకున్నట్టు వెల్లడించారు విష్ణురాజు. జనసేన అధినేత పవన్‌ కు నాకు మధ్య ఈ విషయాలపైనే చర్చ జరిగిందన్నారు. కాగా, జనసేనలో చేరలేదంటూ తాజాగా విష్ణురాజు ప్రకటించడం చర్చనీయాశంగా మారింది.