రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ దూకుడు

రాయ్‌పూర్‌: రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ దూసుకెళుతోంది. రాజస్థాన్‌లో 199 స్థానాలకు గాను 92 స్థానాల్లో ఆ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. భాజపా 64 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక ఛత్తీస్‌గఢ్‌ 90 స్థానాల్లో 55 స్థానాల్లో కాంగ్రెస్‌, 20 స్థానాల్లో భాజపా ఆధిక్యంలో ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో 85 స్థానాల్లో భాజపా, 79 స్థానాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇక్కడ రెండు పార్టీల మధ్య హోరాహోరీ నెలకొంది. మిజోరంలో 40 స్థానాలకు గాను మిజో నేషనల్‌ ఫ్రంట్‌ 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అధికార కాంగ్రెస్‌ 4 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది.