రాతపూర్వక సమాధానాలు పంపించాలి

rajivశాసన సభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఉన్నతాధికారులతో సీఎస్ రాజీవ్ శర్మ సమీక్షా సమావేశం నిర్వహించారు. గడిచిన శాసనసభ సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాతపూర్వక సమాధానాలు వెంటనే పంపించాలని అధికారులను ఆదేశించారు. అటు వచ్చే సమావేశాల్లో సభ్యులు అడిగే ప్రశ్నలకు యుద్ధ ప్రాతిపదికన సమాధానాలు సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎస్ సూచించారు.