రాప్తాడులో ప్రత్యేక హోదా ఆందోళనలు

అనంతపురం ,మే24(జ‌నం సాక్షి): ప్రత్యేక   హోదా ఇవ్వాలని, విభజన చట్టంలోని హావిూలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రత్యేక హోదా సాధన సమితి, సిపిఎం, సిపిఐ, వామపక్షాలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రాష్ట్రవ్యాప్తంగా మూడో రోజూ కొనసాగాయి. గురువారం అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన రిలే నిరాహార దీక్షలో నాయకులు మాట్లాడుతూ.. విభజన హావిూలను ఇప్పటికైనా అమలు చేయాలన్నారు. ఎపికి ప్రత్యేక ¬దా, విశాఖకు రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.