రామగుండంలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

ఆదిలాబాద్, సెప్టెంబర్ 18: జిల్లాను ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ముద్ద చేస్తున్నాయి. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సింగరేణి ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కరీంనగర్ జిల్లాలోని రామగుండంలో కూడా వర్షాల వల్ల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఆదిలాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి, ఖానాపూర్, బోధ్, చెన్నూరులో భారీ వర్షం కురిసింది. జిల్లాలోని గొర్లపల్లి వాగు ఉధృతికి 25 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.