రామయ్య సన్నిధిలో ఘనంగా శరన్నవరాతి

మహాలక్ష్మిగా దర్శనమిచ్చిన లక్ష్మీతాయారు
భద్రాచలం,అక్టోబర్‌14 (జనం సాక్షి) : దక్షిణాది అయోధ్య భద్రాచలం రామయ్య సన్నిధిలో దేవీ నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిదో రోజు మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. లక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం మహా నివేదన రాజభోగం నిర్వహించారు. మధ్యాహ్నం సామూహిక లక్ష కుంకుమార్చనలు జరిగాయి. రాత్రి 8 గంటలకు సీతారాముల నిత్యకల్యాణమూర్తులకు తిరువీధి సేవ నిర్వహిస్తారు. శుక్రవారం నిజరూప అలంకారంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. శుక్రవారం సాయంత్రం దసరా మండపంలో శవిూ పూజ, ఆయుధ పూజ నిర్వహిస్తారు. అదేవిధంగా శ్రీరామలీలా మహోత్సవం జరుగనుంది.