రాముడు కోరుకున్నప్పుడే ఆలయనిర్మాణం: డిప్యూటి సిఎం

లక్నో,నవంబర్‌12(జ‌నంసాక్షి): రాముడు కోరుకున్నప్పుడే అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతుందని ఉత్తరప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి దినేశ్‌ శర్మ వ్యాఖ్యానించారు. యూపీ సహకార మంత్రి ముకుత్‌ బీహారి వర్మ నివాసంలో జరిగిన ఓ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా ఆయన ఈ మేరకు స్పందించారు. సంకల్ప్‌ యాత్ర సందర్భంగా రామాలయ నిర్మాణంపై తమ వైఖరి ఏమిటో బీజేపీ స్పష్టంగా చెప్పింది. అన్నట్టుగానే ఆ పనిచేసి తీరుతాం. శ్రీరాముడు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆయనే కారకుడిగానూ, కారణంగానూ ఉండి దీన్ని జరిగిస్తారు.. అని శర్మ పేర్కొన్నారు.