రాష్ట్రంలో కొత్తగా 2159 కరోనా కేసులు..
– వెెయ్యి దాటిన మరణాలు
హైదరాబాద్,సెప్టెంబరు 17(జనంసాక్షి): తెలంగాణలో కొత్తగా 2,159 కొవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,65,003కి చేరింది. కొత్తగా 2180 మంది వైరస్ నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 1,33,55 మంది ఇండ్లకు చేరుకున్నారు. తాజాగా మరో 9 మంది మృతి చెందగా, మొత్తం 1,005 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,443 యాక్టివ్ కేసులున్నాయని, మరో 23,674 మంది ¬ం ఐసోలేషన్లో ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ చెప్పింది. కాగా, రాష్ట్రంలో 0.60శాతం మరణాల రేటు ఉండగా, రికవరీ రేటు 80.94శాతంగా ఉందని, ఇది దేశ సగటు (78.59శాతం) కంటే ఎక్కువని పేర్కొంది. నిన్న ఒకే రోజు 53,094 శాంపిల్స్ పరీక్షించగా, 1032 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని, ఇప్పటికీ మొత్తం 23,29,316 టెస్టులు చేసినట్లు వివరించింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ జీహెచ్ఎంసీలో 318 నిర్ధారణ కాగా, తర్వాత రంగారెడ్డి 176, నల్గొండ 141, సిద్దిపేటలో 132, మేడ్చల్ మల్కాజ్గిరి 121, కరీంనగర్ 127, వరంగల్ అర్బన్లో 98 పాజిటివ్ కేసులు రికార్డు అయినట్లు వివరించింది.