రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలి

 రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగ భృతి చెల్లించాలని బీజేవైఎం మండల అధ్యక్షులు  బంటు విశ్వనాథ్  ఆధ్వర్యంలో  ఉప తహశీల్దార్ రాజీ రెడ్డి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ఈ సందర్భంగా బీజేవైఎం మండల అధ్యక్షుడు విశ్వనాధ్  మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు గడుస్తున్నా గాని తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయకుండా  నిరుద్యోగుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు
 ఎన్నికల హామీలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇస్తానని దాదాపు 48 నెలలు గడుస్తున్నా గాని ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి అమలు కావడం లేదని వారు అన్నారు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని శాఖలకు నోటిఫికేషన్లు జారీ చేసి ఉద్యోగాలను భర్తీ చేయాలని ఇప్పటివరకు ప్రతి నిరుద్యోగికి 48 నెలల నిరుద్యోగ భృతి ఒక్కో నిరుద్యోగి 1,44 768 రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలనిఇప్పటివరకు జారీ చేసిన నోటిఫికేషన్లకు వెంటనే నియామకాలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బిజెవైఎం  ఉపాధ్యక్షులు శ్రవణ్ సింగ్, ప్రధాన కార్యదర్శి సాయి గౌడ్,బీజేపీ మండల అధ్యక్షులు అడివన్న, మాజీ అధ్యక్షులు సంగమేశ్వర పాటిల్, నాయకులు అశోక్ ముదిరాజ్ , మొగులప్ప తదితరులు పాల్గొన్నారు.