రాష్ట్రంలో రాక్షస పాలన :కోమటిరెడ్డి 

నల్లగొండ,మే3(జ‌నంసాక్షి): రాష్ట్రంలో రాక్షసపాలనతో రైతులు, నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ముందు కేజీ టూ పీజీ, రెండు పడక గదుల ఇళ్లు, గిరిజన, ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హావిూలను తెరాస ప్రభుత్వం విస్మరించిందన్నారు. నిధులు, నీళ్లు, నియామకాలంటూ ప్రజలకు కళ్లబొళ్లి కబుర్లు చెప్పి నేడు వాటిని గాలికి వదిలేశారన్నారు. డిండి, ఏలేశ్వరం ప్రాజెక్టులకు నిధులు ఖర్చు చేయడం లేదని, కనీసం డీపీఆర్‌ అనుమతులు కూడా పొందలేకపోయారని విమర్శించారు. కనీసం ఒక్క ఎకరానికి కూడా నీరుపార లేదని ఎద్దేవా చేశారు. టిడిపి నేతల రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాగ్రామాన పాదయాత్ర చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని కోరారు.