రాష్ట్రపతి ఎన్నిక సిద్ధాంతాల మధ్య పోరు: మీరాకుమార్

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలను సిద్ధాంతల మధ్య పోరుగా ఉమ్మడి విపక్షాల అభ్యర్థి మీరాకుమారి అభివర్ణించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో 17 పక్షాల నేతలు సమావేశమై తనను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు నిజానికి సిద్ధాంతాలు, ఆదర్శాల మధ్య పోరని, 17 పక్షాలు తమ వెంట ఉన్నాయని అన్నారు. ఈ సిద్ధాంతాల ఆధారంగానే ప్రచారం మొదలు పెడతామని చెప్పారు.