రాహుల్ కోసమే పిసిసి అధ్యక్షుల మార్పు
హైదరాబాద్,మార్చి2(జనంసాక్షి): రాహుల్గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించేందుకే పిసిసి అధ్యక్షులను మారుస్తున్నారని కాంగ్రెస్లో ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ సోమవారం ఐదుగురు కొత్త పీసీసీ అధ్యక్షులను నియమించింది. వచ్చే నెలలో ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్గాంధీ బాధ్యతలు చేపడతారని భావిస్తున్న నేపథ్యంలో ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. దిల్లీ పీసీసీ అధ్యక్షుడిగా అజయ్మాకెన్ను నియమించారు. మొన్నటి ఢిల్లీ ఎన్నికల పరాభవాన్ని దృష్టిలో పెట్టకుని ఆయన రాజీనామాచేశారు. అయితే ఆయన నిజాయితీకి తిరిగి అధ్క్ష బాధ్యతలను అప్పగించారు. ఉత్తమ్కుమార్రెడ్డి తెలంగాణకి, అశోక్ చవాన్ మహారాష్ట్రకి, గులాం అహ్మద్ విూర్ జమ్ముకశ్మీర్కి, భరత్సింహ్ సోలంకి గుజరాత్కి పీసీసీ అధ్యక్షులుగా నియమితులయ్యారు. ఇంకా మరికొన్ని మార్పులు ఉంటాయని అంటున్నారు.