రాహుల్, సోనియా,ప్రియాంకలకు ఎస్ పీజీ భద్రత ఉపసంహరణ

న్యూఢిల్లీ, నవంబర్ 8(జనంసాక్షి): గాంధీ కుటుంబానికి (సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ)ఎస్పీజీ భద్రత ఉపసం హరించుకోవాలని మోడీ సర్కార్ నిర్ణయించింది. జడ్ ప్లస్ సెక్యూరిటీని గాంధీ ఫ్యామిలీకి కల్పించి ఎస్పీజీ తొలగించాలని కేందప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రభు త్వ వర్గాలు తెలిపాయి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ తో జడ్ ప్లస్ సెక్యూరిటీని వారికి ఇవ్వనున్నారు. ఈ ఏడాది ఆగస్టులో మాజీ  కు ముందే ఎవ్వడు అను పదము అందాలు ఇలాంటి వాళ్లతో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు కూడా ప్రత్యేక భద్రతా బృందం(ఎస్పీజీ) భద్రతను కేంద్రం వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. 20ఏళ్ల క్రితం మాజీ ప్రధానులు హెచ్ డీ దేవెగౌడ,వీపీ సింగ్ లకు కూడా ఇదే విధంగా ఎస్పీజీ సెక్యూరిటీని ఉపసంహరించిన విషయం తెలిసిందే. అయితే అనారోగ్యం కారణంగా కొన్నేళ్ల పాటు ఇంటికే పరిమితమైన మాజీ ప్రధాని వాజ్ పేయి చనిపోయిన 2018 వరకు ఆయనకు ఎస్పీజీ భద్రత కల్పించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత ప్రధానుల భద్రత కోసం 1985లో ఎస్పీజీ వ్యవస్థ ఏర్పాటు అయింది. అయితే 1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య తర్వాత మాజీ ప్రధానులు, వారి కుటుంబాలకు 10ఏళ్ల పాటు ఎస్పీజీ భద్రత కల్పించే విధంగా ఎస్పీజీ చట్టానికి సవరణ చేశారు. అయితే 2003లో మాజీ ప్రధాని వాజ్ పేయి… 10ఏళ్ల నుంచి ఒక ఏడాదికి లేదా కేంద్రం నిర్ణయించిన ముప్పు స్థాయిని బట్టి ఇచ్చేలా ఎస్పీజీ సెక్యూరిటీ కల్పించేలా చట్టానికి మరోసారి సవరణ చేశారు. ఎస్పీజీలో 3 వేలకు పైగా సిబ్బంది ఉన్నారు. బెదిరింపు అవగాహన ఆధారంగా ఈ ప్రత్యేక బృందం ప్రధానమంత్రులతో పాటు మాజీ ప్రధానమంత్రులు, వారి కుటుంబాలను కవర్ చేస్తుంది. ప్రస్తుతం ఎస్పీజీ హోదా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, కాంగ్రెస్ జాతీయాధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలకు కొనసాగుతోంది. అయితే ఇప్పుడు గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను తొలగించాలని నిర్ణయించడంతో ఇకపై ప్రధాని నరేంద్రమోడీ మాత్రమే ఎస్పీజీ భద్రతను కలిగి ఉంటారు.