రూర్బన్ హౌజ్ సర్వేను పరిశీలించిన ఎంపీడీఓ

ఎడపల్లి, సెప్టెంబర్ 1 ( జనంసాక్షి ) : ఎడపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో రూర్బన్ హౌజ్ సర్వే ప్రారంభమైంది. ఈ మేరకు మండలంలోని జైతాపూర్ గ్రామంలో ఎడపల్లి ఎంపీడీఓ రాజేశ్వర్ రూర్బన్ హౌజ్ సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రాజేశ్వర్ మాట్లాడుతూ, మండలంలోని అన్ని గ్రామాలలో జరుగుతున్న రూర్బన్ హౌజ్ సర్వేను పకడ్బంధీగా నిర్వహించాలని ఆయన అన్నారు. ఈ మేరకు గ్రామాలలో నిర్వహించే సర్వే ద్వారా వివిధ వర్గాలకు న్యాయం జరగడంతో పాటు గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అందువల్ల ఇందులో సర్వేనే కీలకమని ఆయన అన్నారు. సర్వే అధికారులు సైతం సర్వేను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని ఆయన అన్నారు. కోట్లాది నిధులు ఈ పథకం ద్వారా వస్తాయని అందువల్ల ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా ఉండాలని ఎంపీడీఓ రాజేశ్వర్ అన్నారు. ఎంపీడీఓ వెంట ఈజీఎస్ ఏపీవో సాయిబాబా గౌడ్, జైతాపూర్ కార్యదర్శి గిరిజ ఉన్నారు.