రూ.12లక్షల విలువగల గంజాయి పట్టివేత…

మెదక్: నారాయణఖేడ్ మండలం హంగర్గా గ్రామపంచాయతి పరిధిలోని లాల్‌సింగ్ తండాలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన గంజాయి నిల్వలను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన కిషన్ నాయక్ మహారాష్ట్రకు గంజాయిని సరఫరా చేయడం కోసం ఒడిశా నుంచి తెప్పించుకున్నాడు. విషయం తెలుసుకున్న ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి.. గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితున్ని అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారూ రూ.12 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.