రెండు ఆర్టీసీ బస్సులు ఢీ:8మందికి గాయాలు..

హైదరాబాద్ : నల్లగొండ జిల్లాలో మరో రోడ్డుప్రమాదం జరిగింది.. నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రి దగ్గర రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి.. ఈ ఘటనలో ఎనిమిదిమంది గాయపడ్డారు.. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.. ఈ బస్సుల్లో ఒకటి మణుగూరునుంచి హైదరాబాద్‌కు వస్తుందగా… మరో బస్సు హైదరాబాద్‌నుంచి విజయవాడ వెళుతోంది.. అతి వేగంతో గుద్దుకోవడంతో రెండు బస్సులు నుజ్జు నుజ్జయ్యాయి.. ఇదే జిల్లాలో బుధవారం రామన్నపేట వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో పదిమంది మృత్యువాత పడ్డారు..